
ఉరుకులు.. పరుగులు
ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తున్న సిబ్బంది
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ నియామక డీఎస్సీ–2025 పరీక్షలు జిల్లాలో శుక్రవారం ప్ర శాంతంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విధానంలో జిల్లాలో ఆరు కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం షిఫ్టులో 789 మంది రాయాల్సి ఉండగా 710 మంది పరీక్ష రాశా రు. మరో 79 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం షిఫ్టులో 670 మందికిగాను 592 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 78 మంది డుమ్మా కొట్టారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆరు కేంద్రాల్లో ఎంఈఓ స్థాయి అధికారులను ఆరుగురిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా నియమించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పలు కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
అవస్థలు పడిన అభ్యర్థులు
పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి డీఎస్సీ అభ్యర్థు లు ఆపసోపాలు పడుతున్నారు. దూర ప్రాంతాల్లో కేటాయింపు జరిగిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఉరుకులు పరుగులు తీశారు. కేంద్రాల వద్ద ఆధార్ కార్డులో అభ్యర్థుల చిన్ననాటి ఫొటో చూసి, మరో గుర్తింపు కార్డు కావాలని ముప్పుతిప్పలు పెట్టారు. మహిళా పోలీసులను నియమించలేదని అభ్యర్థులు తెలిపారు.
డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు సుదూర ప్రాంతాల అభ్యర్థుల అవస్థలు
జిల్లాలో ఉదయం 79 మంది, మధ్యాహ్నం 78 మంది గైర్హాజరు

ఉరుకులు.. పరుగులు