కేశవరావు పెద్ద కర్మపై ఆంక్షలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

కేశవరావు పెద్ద కర్మపై ఆంక్షలు సరికాదు

Jun 1 2025 12:48 AM | Updated on Jun 1 2025 12:48 AM

కేశవర

కేశవరావు పెద్ద కర్మపై ఆంక్షలు సరికాదు

టెక్కలి: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు పెద్దకర్మ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదంటూ సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌, చిట్టిపాటి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మృతదేహాన్ని అప్పగించకుండా ఆంక్షలతో అడ్డుకున్నారని, ఇప్పుడు కుటుంబ సభ్యులు చేపట్టనున్న పెద్దకర్మ కార్యక్రమం పై పోలీసులు లేని పోని ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని పేర్కొన్నారు. ఎలాంటి సంతాప సభలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు చేస్తున్న కార్యక్రమానికి ఈ విధంగా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. దీన్ని వివిధ రాజకీయ పా ర్టీలు, ప్రజా సంఘాలతో పాటు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఉద్దానంలో కార్గో విధ్వంసం వద్దు

మందస: మందస మండలం బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్‌ పోర్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కోమర వాసు పిలుపు మేరకు ప్రజా కళా మండలి అధ్యక్షుడు కొర్రాయి నీలకంఠం, రంగం కళాకారుడు కొనారి సూధన్‌ ఆధ్వర్యంలో శనివారం కళాజాత కార్యక్రమం నిర్వహించారు. పచ్చని ఉద్దానంలో విధ్వంసకర ఎయిర్‌ పోర్టు నిర్మాణాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాంపురం, భేతాళపురం, చీపురుపల్లి గ్రామాల ప్రజలు వీరికి సంఘీభావం తెలిపారు. ఏ అభివృద్ధి పనులైనా ప్రజలకు ప్రయోజనం కలిగించాలని, వారి ఆమోదం ఉండాలని సీపీఎం కార్యదర్శి డి.గోవిందు, జిల్లా కార్యదర్శి తాండ ప్రకాశ్‌, కొర్లా హేమారావు, తెప్పల అజయ్‌ తెలిపారు. భాగంగా జుత్తు గున్నయ్య, తెప్పల గున్నయ్య, దున్న హరికృష్ణ, రాములమ్మ, కృష్ణారావు, ఉద్యానవనం యూనివర్సిటి బోర్డు మెంబర్‌ బత్తిని లక్ష్మణరావు, నారాయణ, గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.

పీఎస్‌హెచ్‌ఎంల వెబ్‌ ఆప్షన్‌కు మరో రోజు గడువు పెంపు

శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల వెబ్‌ ఆప్షన్‌కు ప్రభుత్వం మరో రో జు గడువు పెంచింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి వెబ్‌ఆప్షన్ల నమో దు చేసుకునేందుకు ఆదివారం సాయంత్రం వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

నేత్రపర్వంగా మల్లన్న వార్షిక కల్యాణం

టెక్కలి: టెక్కలి మండలం రావివలస గ్రామంలో గల ఎండల మల్లి కార్జునస్వామి దేవస్థానంలో శనివారం స్వామి వా రి వార్షిక కల్యా ణాన్ని నేత్రపర్వంగా నిర్వహించా రు. కార్యనిర్వహణాధికారి జి.గురునాధరావు ఆధ్వర్యంలో అర్చకులు రామకృష్ణ, మోహన్‌రావు, యుగంధర్‌ తదితరులు భ్రమరాంబ సమేత మల్లన్నకు కల్యాణం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌.ఎల్‌.నాయుడు, బి.జగదీ శ్వర్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కేశవరావు పెద్ద కర్మపై ఆంక్షలు సరికాదు 1
1/1

కేశవరావు పెద్ద కర్మపై ఆంక్షలు సరికాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement