
●పట్టించుకోవడం లేదు
నా భర్త రామారావు ఇటీవల మృతిచెందారు. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ తీసుకునే వారు. ఆయన చనిపోయాక నాకు పెన్షన్ ఇస్తారని పెద్దలు చెప్పారు. దీంతో నేను సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. వెంటనే మంజూరు చేశారు. కానీ దాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే అడ్డుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ గ్రీవెన్స్కు వెళ్లాం. కలెక్టర్ ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేశారు. కానీ పింఛన్ మాత్రం ఇవ్వలేదు. మాలాంటి పేదల పొట్టలు కొడుతున్నారు.
– గుజ్జు లక్ష్మి, కటకమయ్యపేట, బూర్జ మండలం