
శ్రీముఖలింగంలో మైనాకోత్సవం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్టమాసం ఐదో బుధవారం స్వామివారికి మైనాకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ముందుగా హోమం బలిహరణ అనంతరం పార్వతీ పరమేశ్వరులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అదే సమయంలో పార్వతీపరమేశ్వరుల వివాహ మహోత్సవం నచ్చని మైనాకుడు స్వామి గృహాన్ని దహనం చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని మైనాకోత్సవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.