
● అ‘పూర్వ’ సమ్మేళనం
పోలాకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997–98 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు మంగళవారం అదే పాఠశాలలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పిలిచి సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎంవీఏ నాయుడు, కూసెట్టి శ్రీను, గంగేటి సురేష్, మిరియాపల్లి వెంకట అప్పలనాయుడు, బరాటం ప్రసాద్, బరాటం సుమన్, పెద్దాడ వెంకట్, బచ్చు అప్పన్న, ఇప్పిలి ముద్దులు తదితరులు పాల్గొన్నారు.
– పోలాకి