
స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు వేళాయె
● సీనియారిటీ జాబితా ప్రకారం అర్హులైన ఎస్జీటీల సర్టిఫికెట్ల పరిశీలన రేపు ● 73 పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్లలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ) పోస్టులను అర్హులైన సెకెండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)లతో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్జీటీల సర్టిఫికెట్లను జూన్ రెండో తేదీన పరిశీలించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లలోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీ (పదవీవిరమణ, మరణం, రీఅపోర్షన్ కారణంగా)గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను అర్హత కలిగిన ఎస్జీటీలు, త త్సమాన కేటగిరిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో భర్తీ చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.
73 పోస్టుల భర్తీకి చర్యలు..
జిల్లాలో వివిధ మేనేజ్మెంట్లలో సబ్జెక్టుల వారీగా మొత్తం 73 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో జిల్లా పరిషత్ పరిధిలో అత్యధికంగా ఎస్ఏ పీఈ (ఫిజికల్ ఎడ్యుకేషన్) 33 పోస్టులు ఉండటం గమనార్హం. సంబంధిత సబ్జెక్టులలో సీనియారిటీ జాబితాను శ్రీకాకుళం డీఈఓ.ఓఆర్జీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. సీనియారిటీ జాబితాలో పేర్కొన్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరీ ఉపా ధ్యాయులు మాత్రమే జూన్ రెండో తేదీన ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం ప్రభుత్వ(బాలుర) ఉ న్నత పాఠశాల వేదికగా జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్జీటీలు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు సర్వీస్ రిజిస్టర్తో తమవెంట తీసుకురావాలని డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు.