
స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి
ఇచ్ఛాపురం రూరల్: స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇచ్ఛాపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇదే మండలంలోని లొద్దపుట్టి గ్రామం పెద్ద వీధికి చెందిన దుర్గాశి మహేశ్(45) అదే గ్రామంలో మంగళవారం రేషన్ షాపు డీలర్ వద్ద అసిస్టెంట్గా సరుకులు పంపిణీ చేశాడు. అనంతరం పక్క గ్రామమైన ఒడిశా సవరదేవి పేటకు రాత్రి సమయంలో నడకదారిన వెళ్తుండగా.. ఒడిశా గుడ్డిభద్ర గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై స్పీడుగా వచ్చి మహేశ్ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో మహేశ్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్కూటీ డ్రైవర్ బండిని వదిలి పరారయ్యాడు. మృతుడి భార్య చాలా రోజుల కిందట మృతి చెందగా పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. మరో కుమార్తె ఉంది. కుటుంబ సభ్యులు పిర్యాధు మేరకు ఒడిశా జరడా పోటీసులు కేసు నమోదు చేశారు.