
కిక్కిరిసిన కాంప్లెక్స్
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రయాణికులతో రద్దీమయంగా కనిపించింది. బుధవారం అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో వాటికి హాజరయ్యేందుకు దూరప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించడంతో కిక్కిరిసిపోయింది. దీంతో ప్రయాణికులు దూరప్రాంతాల కోసం నాన్స్టాప్ టికెట్ కౌంటర్ వద్ద బారులుతీరుతూ కనిపించారు. అలాగే నాన్స్టాప్ పోర్టికో వద్ద కూడా ప్రయాణికులు వారి లగేజీ బ్యాగులు, సూట్కేస్లతో బస్సుల కోసం వేచి ఉండడం కనిపించింది.
బైక్తో గేదెను ఢీకొని వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైమ్: ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట ఎన్హెచ్–16 వద్ద మంగళవారం రాత్రి గేదెను ద్విచక్ర వాహనంతో ఢీకొని రోడ్డుపై పడి ఒడిశాకు చెందిన వ్యక్తి తీవ్రగాయాలపాలై రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా తిహిగిరియా జారాడకు చెందిన భజరంగ బాధ్యత(32) అనే యువకుడు విశాఖపట్నం డాక్యార్డులో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం తన బావమరిదికి ఫోన్చేసి సాయంత్రం 5 గంటలకు విశాఖలో బయల్దేరి ఊరెళ్తానని చెప్పాడు. సరిగ్గా రాత్రి ఏడున్నర గంటలకు తమ్మినాయుడుపేట ఎన్హెచ్–16 వద్దకు వచ్చేసరికి గేదె అడ్డుగా రావడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పి ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలైన ఆయనను స్థానికులు అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

కిక్కిరిసిన కాంప్లెక్స్