అర్హులకు సంక్షేమ పథకాలు అందించండి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సంక్షేమ పథకాలు అందించండి

Jun 5 2025 7:50 AM | Updated on Jun 5 2025 7:50 AM

అర్హులకు సంక్షేమ పథకాలు అందించండి

అర్హులకు సంక్షేమ పథకాలు అందించండి

జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు కృషి చేయాలి

జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకుల విన్నపం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

ర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిరుపేద దళితుల జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదని దళిత సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రుణాల మంజూరులో బినామీల పాత్ర పెరిగిపోయిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరం హాల్‌లో బుధవారం రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపూడి విజయ్‌కుమార్‌ అధ్యక్షతన ఎస్సీ సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం జరిగింది. స్కూల్‌ బస్సులు, ట్రాక్టర్లు, ఇన్నోవా కార్లు వంటి పెద్ద మొత్తంలో రుణాలు బినామీల పేరుతో మంజూరవుతున్నాయని ఆరోపించారు. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియకముందే వెబ్‌సైట్లు మొరాయిస్తున్నాయని, దీంతో అర్హులైన వారు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి చర్యలు లేవు

జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దళిత జేఏసీ నాయకులు విమర్శించారు. కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ యువతకు పారిశ్రామిక ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇస్తున్న రుణాలను ఎమ్మెల్యే, ఎంపీలు సిఫార్సులు చేసిన వారికి కాకుండా, నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేషన్‌కు చెందిన విలువైన భూములను పరిరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని, భూమి కొనుగోలు పథకం పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ దళిత సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రుణాలకు లబ్ధిదారుల ఎంపికలో సిబిల్‌తో సంబంధం లేకుండా మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గడ్డెమ్మ, మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోనేల అప్పారావు, దళిత మాల సంఘాల నాయకులు కల్లేపల్లి రాంగోపాల్‌, తైక్వాండో శ్రీను, డా.కంఠ వేణు, పోతల దుర్గారావు, మట్ట పురుషోత్తం, బత్తిన మోహన్‌రావు, డి.గణేష్‌, అంపోలు ప్రతాప్‌, చల్లా రామారావు, గుర్రాల చినబాబు, చింతాడ శ్రీనివాసరావు, పొట్నూర్‌ రమేష్‌, చిన్నారావు, కుమిలి రాజేష్‌, దువ్వాన అప్పలసూరి, బెలమర ప్రభాకర్‌, టొంపల రమణ, దీర్ఘాసి తిరుమలరావు, పెయ్యల చంటి, అబ్బాస్‌, డి.ధనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement