
శ్రీకాకుళం
అమ్మో..జూన్జూన్ భయపెడుతోంది. ఓ వైపు స్కూలు ఖర్చులు, మరోవైపు ఖరీఫ్ ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. –8లో
ఏడాదిలో హామీలే మిగిలాయి
● వెన్నుపోటు పొడవడంలో బాబుకు ఎవరూ సాటిరారు ● బాబుకు ఓటేసినందుకు జనం నోట్లో మట్టి కొట్టారు ● జూన్ 4న వెన్నుపోటు దినం ● పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
శ్రీకాకుళం రూరల్:
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో హామీలే మిగిలాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు తెలిపారు. జూన్ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం పోస్టర్ను శనివారం స్థానిక పార్టీ కా ర్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం వెన్నుపోటుతోనే మొదలైందన్నారు. వెన్నుపోటు పొడవడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని చురకలు అంటించారు. సాధ్యం కాని హామీలు ఇ చ్చి ఇప్పటికీ వాటిని అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి లక్షా 25వేల కోట్లు బడ్జెట్ అవసరమన్నారు. 25 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3వేలు, రాష్ట్రవ్యాప్తంగా బడికి వెళ్లే 40లక్షల మంది పిల్లలకు రూ.15వేలు ఇస్తామంటూ ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయారని అన్నారు. మహిళలకు ఉచిత
న్యూస్రీల్