
5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. సోమ వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కారం అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్తో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటేందుకు ముందుగా గోతులు చేసేందుకు స్థలాలను గుర్తించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సుగుణాకరరావును ఆదేశించారు. మొక్కలకు ట్రీ గార్డులు కూడా పెట్టాలన్నారు.