
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షుల నియామకం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ౖవెఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ముగ్గుర్ని నియమిస్తూ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రపార్టీ కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా మార్పు అశోక్ చక్రవర్తి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా కాయ భీమశేను, వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా డొప్ప రాములను నియమించారు.
5 నుంచి శ్రీముఖలింగేశ్వరుని కల్యాణ ఉత్సవాలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 5 నుంచి 11 వరకూ జరగనున్నాయని ఈఓ పి.ప్రభాకరరావు సోమవారం తెలిపారు. 5న గణపతి పూజతో ప్రారంభించి ధ్వజారోహణ, బలిహరణ, 6న జేష్ట శుద్ధ ఏకాదశి స్వామివారి తిరువీధి ఉత్సవం, పుట్టమన్ను తేవడం, శతమానం, మట్టెలు తీసుకొని రావడం, రాత్రి తొమ్మిది గంటలకు స్వామి కల్యాణ రాయబారం, పది గంటలకు స్వామివారి కల్యాణ ఔపాసన అనంతరం రాత్రి పార్వతి పరమేశ్వరులను నంది వాహనంపై తిరువీధి ఉత్సవం, 7న స్వామివారి అన్నదానం, ఔపాసన, బలిహరణ, 9న సదస్యం, పండిత సభ, రుగ్వేద పారాయణం, మహా మంత్రపుష్పం, హారతి, 10న మైనాకోత్సవం, స్వామివారి వసంతోత్సవం, అనంతరం పవిత్ర వంశధార నదిలో పుణ్య పవిత్ర స్నానాలు ఉంటాయని తెలిపారు.