
డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో ఇస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 21 వ బ్యాచ్ ను జిల్లా ప్రజా రవాణా అధికారి ఆకాశపు విజయకుమార్ సోమవారం ప్రారంభించారు. ముందుగా 20 వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫి కెట్స్ అందజేసి, అభినందనలు తెలిపారు. అలాగే 22 వ బ్యాచ్లో చేరేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఫీజు, ఇతర వివరాలకు 9441161051, 7382921733 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2వ డిపోమేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కెఆర్ఎస్ శర్మ, శ్రీకాకుళం అసిస్టెంట్ మేనేజర్ వి.రమేష్, ఎస్ఎం ఎంపీ రావు, పీఆర్వో కె.సుమన్, శిక్షకుడు వీఏవీ రావు పాల్గొన్నారు.