
నాడు–నేడు ఆగింది చూడు
నాడు–నేడు విద్యా వ్యవస్థ ఎన్నడూ చూడని విప్లవం. దశాబ్దాల తరబడి అలాగే కునారిల్లుతున్న ప్రభుత్వ బడులకు వైఎస్ జగన్ కొత్త జీవం పోశారు. తాగునీరు, రన్నింగ్ నీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, ఐఎఫ్పీ ప్యానల్స్, గ్రీన్చాక్బోర్డు, ఫర్నీచర్, ఫ్యాన్లు, లైట్లు, ఆర్వో ప్లాంట్లు ఇలా బడులకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలను సంవృద్ధిగా కల్పించారు. నాడు–నేడు మొదటి ఫేజ్ కింద 1247 పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. రెండోఫేజ్లో 1096 విద్యాసంస్థలను బాగు చేశారు.
వీటిలో సగంలో ఆగిపోయిన పనులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కేవలం లక్షల్లో నిధులు వెచ్చిస్తే అయిపోయే పనులను కూడా పూర్తి చేయడం లేదు.
నాడు–నేడుతో సుందరంగా కనిపిస్తున్న జి.సిగడాం మండలం కొత్తపెంట ఎంపీపీ స్కూల్

నాడు–నేడు ఆగింది చూడు