ఐదుగురికి చోటు కల్పించిన అధిష్టానం
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మెంటాడ స్వరూప్
కార్యదర్శిగా యర్రా చక్రవర్తి
సంయుక్త కార్యదర్శులుగా నక్క రామరాజు, చింతు రాఘవరావు, పిన్నింటి సత్యంనాయుడు
నియామక ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ రాష్ట్ర కార్యాలయం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ౖవెఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మెంటాడ స్వరూప్ నియమితులయ్యారు. మరో నలుగురికి రాష్ట్ర యువజన విభాగంలో చోటు కల్పించారు. వీరిలో ఒకరిని రాష్ట్ర కార్యదర్శిగా, మరో ముగ్గురిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగాయి. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పలువురు నియామకమయ్యారు.
మెంటాడ స్వరూప్కు సముచిత స్థానం
జిల్లా యువజన నాయకుడు మెంటాడ స్వరూప్కు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి గుర్తింపు ఇచ్చారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా నియమించారు. గతంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యువజన విభాగం జోనల్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. తాజాగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేస్తుండటంతో అధినేత గుర్తించారు. యువజన విభాగంలో నెంబర్ త్రీగా నియామకమయ్యారు.
టెక్కలి నియోజకవర్గం దేవుపురం ఎంపీటీసీగా, గతంలో సర్పంచ్గా పనిచేసిన యర్రా చక్రవర్తిని యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. పార్టీకి విశేష సేవలు అందించడంతో సరైన గుర్తింపు లభించింది. ఈయన భార్య విశ్వశాంతి చక్రవర్తి గతంలో నందిగాం ఎంపీపీగా పనిచేశారు.
సంయుక్త కార్యదర్శిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన నక్క రామరాజు నియమితులయ్యారు. గతంలో కూడా వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో పనిచేశారు. పార్టీ కోసం అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ రాష్ట్ర పార్టీలో నియమించారు.
నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం బెలమర గ్రామానికి చెందిన చింతు రాఘవరావును యువజన విభాగం రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఆయన తొలిసారి యువజన విభాగంలో చోటు దక్కించుకున్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జీఆర్పురం గ్రామానికి చెందిన పిన్నింటి సత్యంనాయుడును కూడా రాష్ట్ర యువజన విభాగంలో సంయుక్త కార్యదర్శిగా నియమించారు. వీరికి కూడా తొలిసారి యువజన విభాగం దక్కింది.

సిక్కోలుకు పెద్ద పీట