‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తాశ్రువుల సమ్మేళనం’లా జిల్లా పరిస్థితి తయారైంది. హత్యలు, దాడులు, బెదిరింపులు, దొంగతనాలు, దోపిడీలతో ప్రశాంత సిక్కోలులో అశాంతి నెలకొంది. రాజకీయ రా‘బందువుల’ అండదండలతో కొందరు రెచ్చిపోతుండగా.. వ్యవస్థలోని లొ | - | Sakshi
Sakshi News home page

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తాశ్రువుల సమ్మేళనం’లా జిల్లా పరిస్థితి తయారైంది. హత్యలు, దాడులు, బెదిరింపులు, దొంగతనాలు, దోపిడీలతో ప్రశాంత సిక్కోలులో అశాంతి నెలకొంది. రాజకీయ రా‘బందువుల’ అండదండలతో కొందరు రెచ్చిపోతుండగా.. వ్యవస్థలోని లొ

Jun 8 2025 12:34 AM | Updated on Jun 8 2025 12:34 AM

‘ఏ ఊర

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా

●చిన్నపిల్లలపై 2023–2024 టెన్యూర్‌లో 38 లైంగిక నేరాలు జరగ్గా ఇప్పుడా సంఖ్య 42కు పైగా చేరింది. పోక్సో గతంలో 67, ఇప్పుడు 73 నమోదయ్యాయి.

●ఎచ్చెర్ల నవభారత్‌ జంక్షన్‌లో మహిళపై ఆరుగురు మహిళలు అమానవీయంగా దాడి చేశారు.

●కాశీబుగ్గ కేంద్రంగా ఇద్దరు బాలికలకు కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి మద్యం మత్తులో ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీశారు.

●జనవరి 13న రణస్థలం మండలం బంటుపల్లిలో నాలుగో తరగతి చదువుతున్న

ఎనిమిదేళ్ల చిన్నారిని నారు ప్రసాద్‌ (23) అనే యువకుడు సచివాలయం భవనం మీదకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

●జనవరి 30న రాత్రి జిల్లాకేంద్రంలోని ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న

విద్యార్థినిపై దాడి జరిగింది.

●ఫిబ్రవరి 11న తన ఫొటోలు, వీడియోలు న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి పోర్న్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారని, ఇన్‌స్ర్ట్రాగామ్‌, టెలిగ్రామ్‌ యాప్‌ల్లో సైతం హల్‌చల్‌ చేయించారని జిల్లాకేంద్ర సమీపంలో చదువుకుంటున్న విద్యార్థిని రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

●మార్చి 18న తన ప్రాణానికి రక్షణ

కల్పించమని సంతబొమ్మాళి మండలం

గెద్దలపాడుకు చెందిన ఆశా కార్యకర్త

నుత్తు చంద్రమ్మ జిల్లా ఎస్పీని వేడుకుంది.

శ్రీకాకుళం క్రైమ్‌ :

పోలీసులు డ్రోన్లు ఎగరేస్తున్నారు... వాటి కంటికి తవ్వుకెళ్లిపోతున్న ఇసుక కనిపించదు. ఈగిల్‌, శక్తి బృందా లు నిఘా పెట్టాయి.. కానీ జిల్లా కేంద్రంలో గంజా యి బాబులు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.. అయినా దారి దోపి డీలు ఆగడం లేదు. అధికార పక్ష నేతలు మైకు దొరికితే చాలు సుద్దులు చెబుతున్నారు.. విపక్ష నాయకులపై కక్ష సాధింపులు ఆగడం లేదు. ప్రశాంతమైన సిక్కోలు ఏడాది కూటమి పాలనలో లెక్కకు మిక్కిలిసార్లు రోదించింది. రక్తం, కన్నీరు కలిసి ప్రవహించగా శాంతిభద్రతలు ప్రశ్నార్థకమయ్యా యి. వైఎస్సార్సీపీ కార్యకర్తలనే కాక ఓట్లేసిన ప్రజ లు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, సోషల్‌ మీడి యా యాక్టివిస్టులు, దళితులు ఇలా ఎవరు ప్రశ్నించినా కేసులు వచ్చి వాలిపోతున్నాయి. ఒక్క పలాసలోనే ఇలా 36 కేసులు నమోదు కావడం విశేషం. ఇందులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై నాలుగు కేసులు కట్టడం గమనార్హం. శ్రీకాకుళంలో 14, టెక్కలిలో పది కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత ఉందా..?

●జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతోంది.

●ఆమదాలవలసకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ తనపై ఎస్‌ఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

●డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఓ వివాహితను ఉద్యోగమిప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకోవడమే కాక శారీరకంగా లోబర్చుకున్నాడు. వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం జిల్లాలో సంచలనం రేకెత్తించింది.

●నిన్నటికి నిన్న ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ బాత్రూమ్‌లో తోటి సహోద్యోగి అశ్లీల చిత్రాలు తీశాడు.

హత్యల్లో కొన్ని..

●మంత్రి అచ్చెన్న సొంత పంచాయతీ నిమ్మాడలో ని వెంకటాపురం గ్రామంలో తోట మల్లేషు అనే వ్యక్తి టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయారు.

●గత ఏడాది ఆగస్టు 18 అర్ధరాత్రి ఎచ్చెర్ల ఫరీదుపేటకు చెందిన వైఎస్సార్‌ సీపీ సాధారణ కార్యకర్త కూన ప్రసాద్‌ను దారి కాచి టీడీపీ కార్యకర్తలు కొట్టారు. ఆయన ఆగస్టు 24న మరణించాడు.

●డిసెంబరు 6న గార మండలం శ్రీకూర్మం ఆర్టీసీ కూడలిలో ఉప్పాడ రాజేష్‌ అనే యువకుడిని పాత కక్షల నేపథ్యంలో హతమార్చారు.

●మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. బంగారం దోచుకుని ఆమె మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు.

●మార్చి 28న కవిటి మండలం ఆర్‌.కరాపాడు గ్రామ శివారు రైల్వేగేటు వద్ద 5 నెలల గర్భిణి కొంతాల మీనాక్షిని భర్తే సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.

అంతులేని దాడులు

●అక్టోబరు 16న జిల్లా నడిబొడ్డున బలగమెట్టు వద్ద వందలమంది జనాలు చూస్తుండగా సనపల సురేష్‌ అనే వ్యక్తిని దారుణంగా దాడి చేశారు.

●అక్టోబరు 27న కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో దళిత దంపతులైన చల్ల అప్పలరాజు, దమయంతిలపై టీడీపీ వాళ్లు ఇంటికి వచ్చి మరీ దాడికి పాల్పడ్డారు.

●అదే రోజు కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌ సాక్షిగా మాజీమంత్రి సీదిరి అనుచరులు అల్లు రమణ, మన్మధలపై టీడీపీ నాయకులు దాడిగి తెగబడ్డారు.

●అక్టోబరు 26న ఉత్సవాల్లో డ్యాన్స్‌ చేయను అన్నందుకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై పలాస మండలం తెలుగు యువత అధ్యక్షులు కిక్కర ఢిల్లీరావు దాడికి పాల్పడ్డాడు.

●నవంబరు 16న వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు మహిళలపై దాడి చేశారు.

●జనవరిలో పాతపట్నం దువ్వారివీధికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్దింటి తిరుపతిరావుపై వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు మెడపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

సిక్కోలులో రౌడీల రాజ్యం

శ్రీకాకుళం టూటౌన్‌ పరిధిలో నైట్‌బీట్‌ విధుల్లో ఉ న్న కనకరాజు అనే కానిస్టేబుల్‌ దాడికి గురయ్యారు. డీసీఆర్బీ హెడ్‌కానిస్టేబుల్‌ త్రినాధరావుపైనా దాడి జరిగింది. దమ్మలవీధిలో ఓ ఎస్‌ఐను తోసేశారు.

కూటమి పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు పెరుగుతున్న దాడులు, వేధింపులు శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా1
1/4

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా2
2/4

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా3
3/4

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా4
4/4

‘ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం.. వ్యవస్థ సమస్తం రక్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement