కొనసాగుతున్న కంచమ్మతల్లి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కంచమ్మతల్లి ఉత్సవాలు

Jun 8 2025 12:31 AM | Updated on Jun 8 2025 12:31 AM

కొనసాగుతున్న కంచమ్మతల్లి ఉత్సవాలు

కొనసాగుతున్న కంచమ్మతల్లి ఉత్సవాలు

కంచిలి: మండల కేంద్రం కంచిలిలో కంచమ్మతల్లి గ్రామదేవత ఉత్సవాలు ఆరో రోజైన శనివారం వైభవంగా జరిగాయి. అమ్మవారిని పీఠస్థానం నుంచి నేరుగా రైల్వే క్టార్టర్స్‌, మల్లా క్వార్టర్స్‌ మీదుగా ఎస్‌.ఆర్‌.సి.పురం కాలనీలో ఊరేగింపు చేపట్టారు. పార్వతీపురానికి చెందిన నమో వెంకటేశాయ, తాడేపల్లిగూడెం నవదుర్గలు, శ్రీకాకుళం దాండియా, గోపాల్‌పూర్‌ ధూమ్‌ ధమాకా, స్థానిక కళాకారుల గ్రూప్‌ డ్యాన్స్‌, పద్మనాభపురం పాలబొమ్మలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఢిల్లీ ఈవెంట్స్‌ ప్రోగ్రామ్‌కు జనం పోటెత్తారు. మరోవైపు అమ్మవారి నమూనా విగ్రహం ప్రాంగణం వద్ద వచ్చిన భక్తులకు పలువురు దాతలు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement