
విద్యుత్ షాక్తో ఆవులు మృత్యువాత
సారవకోట: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో రెండు పాడి ఆవులు మృత్యువాతపడ్డాయి. సారవకోట మండలం బుడితి గ్రామంలో నేతింటి నీలయ్య తన పాడి ఆవును పొలంలో మేతకు తీసుకెళ్లాడు. అక్కడ రైస్ మిల్లు కోసం ఏర్పాటు చేసిన రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగలడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రూ.75 వేలు విలువైన ఆవు మృతి చెందినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎచ్చెర్ల: లావేరు మండలం ఇజ్జాడపాలెంలో తిరుపతి అనే వ్యక్తికి చెందిన ఆవు శనివారం ట్రాన్స్ఫార్మర్ వద్ద పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.

విద్యుత్ షాక్తో ఆవులు మృత్యువాత