
తీరాల్లో ఇసుక వరద
అక్రమార్కుల ముందు చూపు ●
● వర్షాలతో నదుల్లోకి నీరు వస్తుందని ‘ముందు జాగ్రత్త’ ● వంశధార, నాగావళి, బాహుదాలో తవ్వకాల జోరు ● మంత్రులు, ఎమ్మెల్యేల పేరు చెప్పి దందా
వెసులుబాటు సాకుతో..
గత నెల గడువు ముగిసిన ఇసుక రీచ్ల్లో తవ్వి, పోగులేసిన ఇసుకను తర్వాతైనా విక్రయించుకుని, తరలించుకోవచ్చని ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు వెసులుబాటు ఇచ్చారు. ఆ రీచ్ల పేరు చెప్పి ఎక్కడికక్కడ ప్రస్తుతం కూడా పోగులేసి దోచుకుంటున్నారు. వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో దర్జాగా యంత్రాలతో తవ్వకా లు జరిపి, లారీలు, ట్రాక్టర్ల ద్వారా నదీ తీర గ్రామాల్లో తోటల్లోనూ, వంతెనలకు అటు ఇటు డంప్ చేస్తున్నారు. అంతేకాకుండా నడుస్తున్న డీసిల్టేషన్ పాయింట్లలో కూడా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ఆ ఇసుకను కూడా తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. సాధారణంగా నదిలో మేట వేసి ఉంటే దాన్ని మాత్రమే డీసిల్టేషన్ కింద తొలగించాలి. కానీ, ఇక్కడ డీసిల్టేషన్ అర్థాన్నే మార్చే సి డీప్ సిల్టేషన్ అన్నట్టుగా నదుల్లో లోతుగా తవ్వేసి ఇసుకను స్వాహా చేస్తున్నారు. నదుల ప్రవాహానికి అడ్డుగా ఉంటుందని డీసిల్టేషన్కు అనుమతిస్తే ఇప్పుడా తవ్వకాలే నదుల గమనా న్ని మార్చేసి, చుట్టు పక్కల ప్రాంతాలను ముంచేసే పరిస్థితులు ఉన్నాయి.
అక్రమాల
బురద
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో ఇదివరకు 18 ఇసుక రీచ్లు ఉండేవి. వాటి కాల పరిమితి గత నెలతోనే ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమైతే వాటిని నిలిపివేయాలి. ప్రస్తుతం డీసిల్టేషన్ పాయింట్లు తప్ప అధికారిక రీచ్లేవీ ఉండకూడదు. కానీ జిల్లాలో అన్ని రీచ్లలో తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వర్షా కాలం సమీపించడంతో తవ్వకాల జోరు మరింత పెంచారు. నదుల్లోకి వరద నీరు వచ్చేస్తే తమ ఇసు క వ్యాపారం పోతుందని విస్తృతంగా తవ్వకాలు జరుపుతున్నారు. తవ్విన ఇసుకను నదీ తీర గ్రామా ల్లోని తోటల్లో డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ ఇసుక పోగులు దర్శనం ఇస్తున్నాయి. అక్కడి నుంచే అమ్మకాలు సాగిస్తున్నారు.
కుమ్మకై ్క దోపిడీ
మంత్రులు, ఎమ్మెల్యేల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నా రు. అంతా కుమ్మకై ్క కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని జేబుల్లో నింపుకుంటున్నారు.
●ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరాం పంచాయతీ దిబ్బలపేట, ముద్దాడ పేట, కాఖండ్యాం, నారాయణపురం, పురుషోత్తపురం, చినంక లాం, నిమ్మ తొర్లాడ, దూసి, తోటాడ, అక్కివరం, బెలమం, లొద్దలపేట, కొత్తవలస, సింగూరు, నై రా, అంబళ్లవలస ●శ్రీకాకుళం నియోజకవర్గంలో ని భైరి, కరజాడ, బూరవల్లి, కళ్లేపల్లి, కిల్లిపాలెం, పొ న్నాం, బట్టేరు, గార ●నరసన్నపేట నియోజక వర్గంలోని మడపాం, పర్లాం, రామకృష్ణాపురం, శ్రీ ముఖలింగం, దొంపాక, లుకలాం, బుజ్జిపేట, చేను వలస, చెవ్వాకులపేట, గోపాలపెంట, ఉర్లాం
●ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బిర్లంగి, బొడ్డవడ, ఈదుపురం, కేశుపురం, కొలిగాం, ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో బహుదా నది కొత్త, పాత బ్రిడ్జిల దగ్గర ●పాతపట్నం నియోజకవర్గంలోని గులుమూరు, ఆకులతంపర, పాత పొనుటూరు తదితర గ్రామాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.