అరటి పంటకు ఈతాకును రక్షణగా ఉంచిన దృశ్యం
పెరుగుతున్న ఎండలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని బోరంపల్లి – గంగవరం గ్రామాల మధ్య అరటి రైతులు అరటి పిలకలకు రక్షణగా ఈతాకును ఏర్పాటు చేశారు. మొక్కను మొత్తం ఎండ నుంచి కాపాడుకునేందుకు రక్షణగా ఓ గొడుగులా చుట్టూ ఏర్పాటు చేశారు. అరటి మొదటి దశలో ఉండగా అంతర పంటగా పలువురు రైతులు టమాట, పప్పుశనగను సైతం సాగు చేశారు.
– కళ్యాణదుర్గం:


