
మాట్లాడుతున్న ఏజీపీ భాస్కరరెడ్డి
పెనుకొండ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సూత్రధారి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని పెనుకొండ కోర్టు ఏజీపీ భాస్కర రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. చాలా విషయాల్లో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఏసీబీ కోర్టు తీర్పుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవినీతి కేసుల్లో చంద్రబాబు కోర్టు ముందు నిలబడక తప్పదన్నారు. 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లోనే స్కాంకు పాల్పడ్డారంటేనే, ఆయన అంతకుముందు ఎన్ని కుంభకోణాలకు తెరతీసి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. త్వరలోనే ఆయన బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ను ఏమీ చేయలేరని, ప్రజల దీవెనలే ఆయనకు శ్రీరామ రక్ష అని భాస్కరరెడ్డి పేర్కొన్నారు.
ఏజీపీ భాస్కరరెడ్డి