వైభవంగా చౌడేశ్వరిదేవి బ్రహ్మరథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా చౌడేశ్వరిదేవి బ్రహ్మరథోత్సవం

Mar 23 2023 12:54 AM | Updated on Mar 23 2023 12:54 AM

రథాన్ని లాగుతున్న భక్తులు  - Sakshi

రథాన్ని లాగుతున్న భక్తులు

లేపాక్షి: మండలంలోని చోళసముద్రంలో చౌడేశ్వరిదేవి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, స్వస్తివాచన, రక్షాబంధన, కలశస్థాపన, అభిషేకములు, నవగ్రహ చౌడేశ్వరిదేవి మూలమంత్ర హోమము, రథాంగ హోమము, పూర్ణాహుతి, రథసంప్రోక్షణ తదితర పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని బ్రాహ్మణులు పల్లకీలో కూర్చుబెట్టి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం నిర్వహించారు. ఆలయం ప్రాంగణం నుంచి గ్రామ సచివాలయం సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఊరేగింపు సాగింది.

అమ్మవారిని రథం వద్దకు తీసుకు వస్తున్న అర్చకులు 1
1/1

అమ్మవారిని రథం వద్దకు తీసుకు వస్తున్న అర్చకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement