అకాల వర్షం... అన్నదాతకు నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం... అన్నదాతకు నష్టం

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

మనుబోలు: మండలంలో సోమవారం వేకువజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు నష్టాన్ని కలిగించింది. మండలంలో రబీ పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో ఆరబోసుకుని ఉన్నారు. ఈ తరుణంలో అకాలం వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. బద్దెవోలు క్రాస్‌రోడ్డు వద్ద పలువురు రైతులకు చెందిన సుమారు 100 పుట్లకుపైగా షుగర్‌లెస్‌, బీపీటీ రకం ధాన్యం తడిసిముద్దయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఎరువుల కొరతతో బ్లాక్‌లో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసి వేయడంతో ఎకరాకు సుమారు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు అయ్యాయి. దీనికితోడు ధాన్యం ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సగం ధరకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement