వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు.. | - | Sakshi
Sakshi News home page

వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు..

Jun 6 2025 12:10 AM | Updated on Jun 6 2025 12:10 AM

వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు..

వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలకు అందించిన ఆర్థిక సహకారంతో ఎంతో మంది వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తలుగా మారారు. సుమారు 1.20 లక్షల మంది మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారు. కూటమి సర్కార్‌ నయవంచన వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం పేరుతో మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేది. ప్రస్తుతం కూటమి పాలనలో ఏడాది నుంచి మహిళలకు ఎటువంటి నగదు అందడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంత మహిళలు సూక్ష్మ సంస్థలో రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

చేజర్లకు చెందిన ప్రమీలమ్మ 14 ఏళ్లుగా పొదుపు గ్రూపులో సభ్యురాలిగా ఉంటోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శిక్షణ తీసుకుని బ్యాంకు రుణం ద్వారా ఊరగాయ పచ్చళ్ల పరిశ్రమ స్థాపించారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు పది మందికి ఉపాధి కల్పిస్తోంది.

రాపూరుకు చెందిన ప్రసన్నలక్ష్మిది నిరుపేద కుటుంబం. పొదుపు గ్రూపులో సభ్యురాలిగా చేరి పొదుపు చేసుకుంటూ వచ్చిన నగదుతో పిల్లలను చదివించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో శిక్షణ పొంది బ్యూటీ పార్లర్‌ స్థాపించారు. ప్రస్తుతం దాని ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని అభివృద్ధి చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement