
నీట్లో మనోళ్లు సత్తా చాటారు
నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 4వ తేదీన నీట్ను ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,913 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. ఎస్ఇ.కవిన్ 161వ ర్యాంకు, శ్రీరామ్ 253, యోగేష్ కార్తీక్ 323, వెంకట శ్రీనివాస్ 515, వైష్ణవ్కుమార్ 546, లలిత్ శ్రీహాస్ 563, సుభాష్ శంకర్ 804, విశ్వక్ 955, కత్రివేల్ 962 ర్యాంకులు సాధించారు. అదే విధంగా జాహ్నవి 588 మార్కులు భానుశ్రీసులోచన 543, హరిణి 542, చేతన్ 531 మార్కులు సాధించారు.
రేడియాలజీ చేస్తా
స్థానిక ఉస్మాన్సాహెబ్పేటలో విశ్వక్ నివాసం ఉంటున్నారు. తండ్రి వంశీకృష్ణ, తల్లి లావణ్య ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఉత్తమ మెడికల్ కళాశాలలో సీటు సాధించి రేడియాలజిస్టుగా పనిచేయడమే లక్ష్యంగా విశ్వక్ చెబుతున్నారు.
– ఎం.విశ్వక్ (955 ర్యాంకు)
న్యూరాలజిస్టునవుతా
స్థానిక భక్తవత్సలనగర్లో జాహ్నవి నివాసం ఉంటున్నారు. తండ్రి రవికుమార్, తల్లి శ్రీలక్ష్మి. మంచి మెడికల్ కళాశాలలో పీజీ చేసి న్యూరాలజిస్టుగా పనిచేయాలన్నదే లక్ష్యంగా జాహ్నవి చెబుతోంది.
– జాహ్నవి (2505 ర్యాంకు)
వైద్య సేవే లక్ష్యం
స్థానిక హరనాథపురంలో లలిత్శ్రీహాస్ నివాసం ఉంటున్నారు. తండ్రి రాజశేఖర్, తల్లి శ్రీలక్ష్మి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మెడిసిన్ చదివి ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యమని లలిత్శ్రీహాస్ చెబుతున్నారు.
– లలిత్ శ్రీహాస్ (563 ర్యాంకు)

నీట్లో మనోళ్లు సత్తా చాటారు

నీట్లో మనోళ్లు సత్తా చాటారు