
మత్స్య సంపదను వేలం వేయొద్దు
కనిగిరి రిజర్వాయర్లో మత్స్య సంపదను వేలం వేయొద్దంటూ కలెక్టర్కు యానాదుల సంక్షేమ సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. వేలం వేస్తే యానాదుల కుటుంబాలు వీధిన పడతాయన్నారు. మత్స్య శాఖకు లీజు చెల్లించేందుకు కొంత సమయం ఇప్పించాలని కోరగా సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య, చెంబేటి ఉష, పొట్టేళ్ల నాగరాజు, శివనాగమణి, పొట్లూరు నాగరాజు, ఏకొల్లు శీనయ్య, బాలు, వెంకటేష్, సొసైటీ డైరెక్టర్లు బంగారయ్య, యల్లంపల్లి శీనయ్య, నరసయ్య, కత్తి బాలయ్య పాల్గొన్నారు.