
సేద్యానికి భరోసా పోయింది
గత ప్రభుత్వంలో రైతులకు ఎంతోమేలు జరిగింది. ఆర్బీకేల ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేశారు. అప్పట్లో వ్యవసాయానికి ఒక భరోసా ఉంది. కూటమి ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చి విత్తనాలు, ఎరువులు అందజేయడం లేదు.
– జీ మోహన్, రైతు, తాటిపర్తిపాళెం,
వెంకటాచలం మండలం
●
గత ప్రభుత్వంలో మా కుటుంబానికి రూ.2 లక్షలు వరకు ఆర్థికంగా సాయం లభించింది. రూ.67,500 రైతుభరోసా, యంత్రా సేవా పథకం ద్వారా ట్రాక్టరు వ్యవసాయ పనిముట్లు 50 శాతం రాయితీ పొందాను. ఇంటి వద్దకే విత్తనాలు, పురుగు మందులు అందించారు. ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ లేదు. గిట్టుబాటు ధరలు లేవు. వ్యవసాయం పూర్తిగా ఎత్తిపోయింది.
– ఎర్రగూటి మాలకొండయ్య,
తూర్పు కొండారెడ్డిపల్లి, వరికుంటపాడు
ఆ నాటి భరోసా లేదయ్యా..!

సేద్యానికి భరోసా పోయింది