
కండలేరులో 40.370 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 40.370 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి ఈఈ రామచంద్రమూర్తి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,300, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
8న శ్రీవారికి
చందనాలంకరణ
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోలనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి మూలమూర్తికి ఈనెల 8వ తేదీన చందనాలంకరణ చేయనున్నట్లు దేవస్థాన అధికారులు ఆదివారం తెలిపారు. ఆరోజు స్వాతి నక్షత్రం స్వామి జన్మనక్షత్రం కావడంతో మూలమూర్తికి ఉదయం వివిధ పూజలు చేస్తామన్నారు. 10 గంటలకు కల్యాణం, రాత్రి 7 గంటలకు బంగారు గరుడసేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సర్ప్లస్ నిర్ణయాన్ని
ఉపసంహరించుకోవాలంటూ..
నెల్లూరు(టౌన్): జీఓను అతిక్రమించి 196 మంది ఉపాధ్యాయులను సర్ప్లస్గా ప్రకటించిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ 257 జిల్లా అధ్యక్షుడు దశరథరాములు, ప్రధాన కార్యదర్శి హజరత్ డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ ప్రాథమిక స్కూల్స్ ప్రధానోపాధ్యాయులుగా ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ను కలిసినా పట్టించుకోలేదన్నారు. జీఓ తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్గా ఉండే విధంగా చేశారన్నారు. జిల్లాలో 196 మందిని సర్ప్లస్గా ప్రకటించిన అధికారులు ఽబదిలీ దరఖాస్తు ముగిసినా వారిని చేసుకోమని బలవంతం చేస్తున్నారన్నారు. టీచర్లను మినహాయిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి నుంచి హామీ లభించడంతో సోమవారం నాటి నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు వెల్లడించారు.
గ్రావెల్ తరలిస్తున్న
ఐదు టిప్పర్ల సీజ్
నెల్లూరు సిటీ: పొదలకూరు మండలంలోని వరదాపురం నుంచి నెల్లూరు వైపు వస్తున్న 5 టిప్పర్లను రూరల్ పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరదాపురం నుంచి రూరల్ మండలంలోని సౌత్మోపూరు మీదుగా నెల్లూరు వైపు అనుమతి లేకుండా గ్రావెల్ను తరలిస్తున్న ఐదు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి యజమానులు, ఐదుగురు డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.
ఇసుక ట్రాక్టర్ను
ఢీకొన్న కారు
● భార్య మృతి
● భర్తకు గాయాలు
దగదర్తి: మండలంలోని ఉలవపాళ్ల జాతీయ రహదారిపై ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై జంపాని కుమార్ కథనం మేరకు.. దీపు శర్మకు రెండు వారాల క్రితం వివాహమైంది. భార్యతో కలిసి బెంగళూరు నుంచి విజయవాడకు కారులో బయలుదేరాడు. ఉలవపాళ్ల వద్దకు చేరుకోగానే వాహనం నడుపుతున్న శర్మ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఇసుకలోడుతో కావలికి వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ట్రాక్టర్ ట్రక్కు కింద ఇరుక్కుని భార్య అక్కడికక్కడే మృతిచెందగా శర్మకు తీవ్ర గాయాలయ్యాయి. మొబైల్, దగదర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకి తీశారు. తీవ్రంగా గాయపడిన శర్మను హైవే అంబులెన్స్లో చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉందని, బంధువులకు సమాచారం అందించామని ఎస్సై తెలిపారు.

కండలేరులో 40.370 టీఎంసీలు

కండలేరులో 40.370 టీఎంసీలు