నేరస్తుల కదలికలపై నిఘా : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

నేరస్తుల కదలికలపై నిఘా : ఎస్పీ

Jun 5 2025 7:48 AM | Updated on Jun 5 2025 7:48 AM

నేరస్తుల కదలికలపై నిఘా : ఎస్పీ

నేరస్తుల కదలికలపై నిఘా : ఎస్పీ

నెల్లూరు(క్రైమ్‌): రౌడీషీటర్లు, సస్పెక్టెడ్‌, కేడీ, డీసీల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. బుధవారం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు, రిసెప్షన్‌ గది తదితరాలను పరిశీలించారు. స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లు, సస్పెక్ట్‌, కేడీ, డీసీలు ఎంతమంది ఉన్నారు?, ఏం చేస్తున్నారు?, వారిలో ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారు? తదితర వివరాలను స్థానిక ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, కేసుల పెండెన్సీని తగ్గించేందుకు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. దొంగతనాల కట్టడికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కేసుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేయాలన్నారు. గొలుసు దొంగతనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై దాడులు ముమ్మరం చేయాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యను తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఆయన వెంట నగర డీఎస్పీ పి.సింధుప్రియ, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement