
గంజాయి అక్రమ రవాణాపై దాడులు
● నలుగురు నిందితుల అరెస్ట్
● 48 కేజీలు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): తిరుపతికి గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ దయాసాగర్ ఆదేశాల మేరకు గురువారం ఎకై ్సజ్ నెల్లూరు – 2 ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కాలేషావలీ తమ సిబ్బందితో కలిసి వెంకటాచలం టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుంచి తిరుపతికి వెళ్తున్న కారును తనిఖీ చేశారు. డిక్కీలో మూడు ప్లాస్టిక్ సంచుల్లో 48 కేజీలున్న 192 గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన శివప్రసాద్ మిషాల్, బంధువులు పూజా మిషాల్, కాన్హు ప్రసాద్ మిషాల్, స్నేహితుడు బుడుపంగిని అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ నెల్లూరు – 2 స్టేషన్కు తరలించి విచారించారు. నిందితులు ఒడిశా రాష్ట్రం ఇంగాలి గ్రామానికి చెందిన బలరామ్ దాలి వద్ద రూ.50 వేలకు గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఎకై ్సజ్ అధికారులు నలుగురు నిందితులతోపాటు బలరామ్ దాలిపై కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి రూ.5 వేల నగదు, మూడు సెల్ఫోన్లు, గంజాయి, కారును సీజ్ చేశారు. తనిఖీల్లో పాల్గొన్న ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మునీర్ అహ్మద్, శకుంతల, సిబ్బందిని ఏసీ దయాసాగర్ అభినందించారు.
కళాశాలపై విచారణ
కందుకూరు రూరల్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో గాయత్రి జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల జవాబుపత్రాలు ట్యాంపరింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ కమిటీని నియమించింది. పరీక్ష కేంద్రమైన శ్రీవివేకా జూనియర్ కళాశాలలో గురువారం కమిటీ విచారణ చేపట్టింది. విచారణాధికారిగా ఉన్న బోర్డు డిప్యూటీ సెక్రటరీ జయలక్ష్మి కళాశాల యాజమాన్యాన్ని, ఇన్విజిలేటర్ను విచారించారు. బాధిత విద్యార్థులైన ఎం.అవినా ష్బాబు, టి. సాయితేజస్వినిని, తల్లిదండ్రులు, గాయత్రి కళాశాల యాజమాన్యం నుంచి స్టేట్మెంట్ తీసుకు న్నారు. ఈ కళాశాలకు చెందిన ఇషాక్, ప్రజ్ఞ అనే విద్యార్థులు కూడా మార్కులు తగ్గాయని, తమ జవాబుపత్రాలు కూడా ట్యాంపరింగై ఉంటాయ నే అనుమానం ఉందని పరిశీలించాలని ఫిర్యాదు చేశారు.