పోలీసుల దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల దౌర్జన్యం

Jun 6 2025 12:10 AM | Updated on Jun 6 2025 12:10 AM

పోలీసుల దౌర్జన్యం

పోలీసుల దౌర్జన్యం

కందుకూరు: గ్రామదేవత అంకమ్మతల్లి దేవాలయం ప్రాంగణంలోని షాపుల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ కందుకూరు పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీ పూలకొట్టు తొలగింపు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రఫీని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఆలయ ప్రాంగణంలో 24 షాపులను నిర్మించి అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు వేలం ప్రక్రియను చేపట్టారు. ఈనెల 7వ తేదీన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేయనున్నారు. ఇందులో భాగంగా ఓవీ రోడ్డు వైపున్న షాపులను, తోపుడు బండ్లను తొలగించే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న రఫీ పూలకొట్టును తొలగించే విషయంలో పోలీసు లు దౌర్జన్యానికి దిగారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై సాంబశివయ్యలు షాపును తొలగించాలని కోరారు. సమయం ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు తొలగించాలంటే ఎలా కుదురుతుందని రఫీ అడిగారు. శుక్రవారం సాయంత్రానికి తీసేస్తానని చెప్పా రు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే సమాచారం ఇచ్చామని, షాపును తొలగించాల్సిందేనంటూ పట్టుపట్టారు. దీంతో ఇరువు రు వర్గాల మధ్య వాగ్వాదం జరి గింది. దీంతో రఫీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా పట్ట ణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సా ర్‌సీపీ శ్రేణులు స్టేషన్‌కు చేరుకుని రఫీని పరామర్శించాయి.

పూలకొట్టు తొలగింపు విషయంలో ఉద్రిక్తత

వైఎస్సార్‌సీపీ నేతను బలవంతంగా

అదుపులోకి తీసుకున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement