కిలో పొగాకు గరిష్ట ధర రూ. 280 | - | Sakshi
Sakshi News home page

కిలో పొగాకు గరిష్ట ధర రూ. 280

Jun 7 2025 12:24 AM | Updated on Jun 7 2025 12:24 AM

కిలో

కిలో పొగాకు గరిష్ట ధర రూ. 280

కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్‌ క్లస్టర్‌కు చెందిన రైతులు 461 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 312 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 149 బేళ్లను తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి టి. ఇషాక్‌స్వర్ణదత్‌ మాట్లాడుతూ కనిష్ట ధర రూ.180 పలకగా, సగటు ధర రూ.238.49 లభించిందన్నారు. వేలంలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.

డీసీపల్లిలో 515 పొగాకు బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 515 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలిపారు. వేలానికి 764 బేళ్లు రాగా 515 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 66686.8 కిలోల పొగాకును విక్రయించగా రూ.14995278.60 వ్యాపారం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా కనిష్ట ధర రూ.180 లభించింది. సగటున రూ.224.86 ధరగా నమోదైంది. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌శాఖ డీసీ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు(క్రైమ్‌): జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్స జ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఎం. శంకరయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పి. దయాసాగర్‌, డీపీఈఓ ఎ. శ్రీనివాసులునాయుడు, ఏఈఎస్‌ జే రమేష్‌, ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు డీసీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీసీ జిల్లాలో ఎకై ్సజ్‌ నేరాలు, నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష

తొలిరోజు 117 మంది గైర్హాజరు

నెల్లూరు (టౌన్‌): డీఎస్సీ పరీక్ష తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 5 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరిగాయి. ఈ పరీక్షకు ఉదయం 679 మందికి 63 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 675 మందికి 54 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు అనుమతించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పిల్లలతో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చారు.

డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎమ్మెస్‌) చైర్మన్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీబొమ్మ సెంటర్‌లోని డీసీసీబీ కార్యాలయంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డి, స్టోన్‌హౌస్‌పేటలోని డీసీఎమ్మెస్‌ కార్యాలయంలో గంగోటి నాగేశ్వరరావు బాధ్యతలు వేదపండితుల ఆశీర్వచనాలతో చేపట్టారు. ఈ సందర్భంగా మెట్టుకూరు మాట్లాడుతూ తాను రెండోసారి డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. షేర్‌ హోల్డర్స్‌కు, బ్యాంకు ఉద్యోగులకు బోనస్‌ అందించేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ శ్రీనివాసరావు, డీసీఓ గుర్రప్ప, డీసీఏఓ తిరుపతయ్య, డీఎల్‌ సీఓ తిరుపాల్‌రెడ్డి, బ్యాంకు సీజీఎం సరిత, డీజీఎం ఉషారాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కిలో పొగాకు గరిష్ట  ధర రూ. 280 1
1/2

కిలో పొగాకు గరిష్ట ధర రూ. 280

కిలో పొగాకు గరిష్ట  ధర రూ. 280 2
2/2

కిలో పొగాకు గరిష్ట ధర రూ. 280

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement