
క్రమక్రమంగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్ వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదల చేయలేదు. జిల్లాలో 132 ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇటీవల నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో కొంత వరకు నిధులు విడుదల చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచారు. అయితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు సేవలందించి తర్వాత ఆరోగ్యశ్రీ పరిధి అయిపోయిందంటూ బయటకు పంపుతున్నారు.
గత ఐదేళ్లలో అందిన సేవలు
ప్రభుత్వ వైద్యం అంతంత మాత్రమే
జిల్లాలో ఒక సర్వజన ఆస్పత్రి, 52 పీహెచ్సీలు, 10 సీహెచ్సీలు, 28 యుపీహెచ్సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో పలువురు డాక్టర్లు సమయానికి వచ్చి థంబ్ వేసి వెళ్లిపోతున్నారు. సొంత క్లినిక్ల్లో సేవల్లో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు వైద్యం గగనమవుతోంది. కొన్ని రకాల దగ్గుమందులు, షుగర్కు ఇన్సులిల్ అందుబాటులో ఉండటం లేదు. మరికొన్ని యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉండడం లేదు. కూటమి ప్రభుత్వంలో రోగులకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

క్రమక్రమంగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం