చికెన్‌ వ్యర్థాలు తరలిస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

చికెన్‌ వ్యర్థాలు తరలిస్తుండగా..

Jun 6 2025 12:10 AM | Updated on Jun 6 2025 12:10 AM

చికెన్‌ వ్యర్థాలు  తరలిస్తుండగా..

చికెన్‌ వ్యర్థాలు తరలిస్తుండగా..

మినీలారీల పట్టివేత

ఆగని సరఫరా

కొడవలూరు: చేపల గుంతలకు చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్న మినీలారీని కొడవలూరు ఎస్సై సీహెచ్‌ కోటిరెడ్డి గురువారం పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. మండలంలోని ఆలూరుపాడు చేపల గుంతలకు గురువారం వ్యర్థాలను తరలిస్తున్నారు. దీనిపై అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు ఎస్సై కోటిరెడ్డి వాహనాన్ని పట్టుకున్నారు. గుంత తీయించి వ్యర్థాలను పూడ్చివేశారు. సీజ్‌ చేసిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేది లేదని, వ్యర్థాల అక్రమ రవాణాను నిలిపివేయాలని ఎస్సై హెచ్చరించారు.

విడవలూరు: మండలంలోని తుమ్మగుంట గ్రామంలో చికెన్‌ వ్యర్థాల వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరేష్‌ కథనం మేరుకు.. బెంగళూరు నుంచి మినీలారీలో వ్యర్థాలను వావిళ్ల వైపు తరలిస్తున్నట్లు ఫిషరీ అసిస్టెంట్‌ కడిబేటి నాగరాజుకు గురువారం సమాచారం అందింది. దీంతో పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి వ్యర్థాలను గుర్తించారు. గుంత తీయించి పూడ్చిపెట్టారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, యజమాని దంపూరుకు చెందిన ఏటూరు మురళిపై కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement