ప్రశ్నించే వారిపై కేసులా? | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే వారిపై కేసులా?

Jun 6 2025 12:10 AM | Updated on Jun 6 2025 12:10 AM

ప్రశ్నించే వారిపై కేసులా?

ప్రశ్నించే వారిపై కేసులా?

వెంకటాచలం: హామీలను అమలు చేయడంలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. చెముడుగుంట వద్ద నున్న జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఆయన, వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి గురువారం ములాఖత్‌ ద్వారా పరామర్శించారు. అనంతరం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారిపై, ప్రజా సమస్యలపై బలంగా పోరాడే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల స్పందన చూస్తే, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందన్నారు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌ నేర్పుతున్న విద్యలే భవిష్యత్‌లో పునరావృతం అవుతాయనే విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్రంలో పని చేసేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా భయపడే పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు.

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

రాజగోపాల్‌రెడ్డితో కలిసి

కాకాణితో ములాఖత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement