
గతం స్వర్ణయుగం.. నేడు తిరోగమనం
ఇది పొగాకు రైతుల దుస్థితి
వైఎస్సార్సీపీ హయాంలో
క్వింటా
కందుకూరు: జిల్లాలో కందుకూరు, కలిగిరి, డీసీపల్లి ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు పంటను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. వేల మంది పొగాకు పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పొగాకు రైతులకు స్వర్ణయుగంలా సాగింది. పొగాకు ధరలు పతనమైన సమయంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి నేరుగా వేలం ప్రక్రియలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పొగాకు వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు లాభాల బాట పట్టారు. ఐదేళ్లూ కాసులు కురిపించింది. ప్రధానంగా 2022–23, 2023–24 సీజన్లు అయితే రికార్డు ధరలు పొగాకు రైతులకు వచ్చాయి. గతేడాది కేజీ పొగాకు సరాసరి ధర రూ.270 వరకు పలికింది. ఇక బ్రైట్గ్రేడ్ పొగాకు అయితే ఏకంగా క్వింటా రూ.37,000 వరకు ధరలు వచ్చాయి. పొగాకు రైతులకు మరో మేలు చేసే చర్యలు కూడా గత ప్రభుత్వం తీసుకుంది. అప్పటి వరకు అధికంగా పండించిన పొగాకుపై 5 శాతం వరకు జరిమానా విధించి పొగాకు కొనుగోలు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అధిక పొగాకు ఉత్పత్తులపై ఉన్న జరిమానాలు పూర్తిగా రద్దు చేయించారు. దీంతో రైతులు ఎటువంటి జరిమానాలు లేకుండానే అధికంగా పండించిన పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం లభించింది. దీని వల్ల ప్రతి రైతుకు అదనంగా రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు లబ్ధి చేకూరింది. పొగాకు చూర, ముక్క వంటివి కూడా వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో రైతులకు అన్ని విధాలా లాభాలు చేకూర్చి ఆదాయాలు రెట్టింపయ్యాయి.
కుప్పకూలిన ధరలు
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో పొగా కు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. 2024–25 సీజన్కు సంబంధించి పొగాకు అమ్మకాలు ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు కావస్తుంది. ప్రారంభ బ్రైట్ గ్రేడ్ పొగాకు ఇచ్చిన రూ.280లే నేటికి ఇస్తున్నారు. అదే గతేడాది బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు రూ.365 పలికితే నేడు అదే పొగాకు రూ.280లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే క్వింటా పొగాకు మీద ఒక రైతుకు రూ.8,500 వరకు నష్టపోతున్నారు. ప్రస్తుతం కేజీ పొగాకు సరాసరి ధర రూ.259లు మాత్రమే పలుకుతుంది. గతేడాదికీ ఇప్పటికీ దాదాపు రూ.15 వేల వరకు తేడా కనిపిస్తుంది. అయినా ప్రభుత్వంలో ఎటువంటి చలనం రావడం లేదు.
ఈయన వలేటివారిపాళెం మండలం అయ్యవారిపల్లెకు చెందిన సాధారణ రైతు ఆవుల వెంకట్రావు. 15 ఎకరాలు పొలం కౌలు తీసుకుని పొగాకు సాగు చేశాడు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది డిమాండ్ వల్ల పొలం కౌలు, కూలీల ఖర్చు, సాగు ఖర్చులు పెరగడంతో ఇప్పటి వరకు రూ.14.75 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పొగాకు మార్కెట్ రేట్ల ప్రకారం వెంకట్రావు వద్ద ఉన్న పొగాకు అమ్మినా కూడా రూ.9 లక్షల వరకు వస్తుంది. ఆయన పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఏడాది సుమారుగా రూ.5.75 లక్షల వరకు వెంకట్రావు పెట్టుబడిని నష్టపోవాల్సిన పరిస్థితి తప్పడం లేదు.

గతం స్వర్ణయుగం.. నేడు తిరోగమనం

గతం స్వర్ణయుగం.. నేడు తిరోగమనం

గతం స్వర్ణయుగం.. నేడు తిరోగమనం