కలెక్టరేట్‌ వద్ద ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ వద్ద ధర్నా

Jun 3 2025 12:10 AM | Updated on Jun 3 2025 12:10 AM

కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ ఎక్కడా ఇళ్ల స్థలాలిచ్చిన దాఖలాల్లేవన్నారు. టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాల్లేవని, వాటిలో ప్రజలు చేరాలంటే భయపడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో నేతలు సయ్యద్‌ సిరాజ్‌, షాన్వాజ్‌, వి.రామరాజు, జిలానీఖాన్‌, కె.ఆంజనేయులు, ముక్తియార్‌, బీసీ శేఖర్‌, లీలామోహన్‌, అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement