
మొదటి రోజు నుంచే రెడ్బుక్ రాజ్యాంగం
సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఏడాదిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రెడ్బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేస్తోంది. కక్ష రాజకీయాలు ప్రోత్సహిస్తూ కాలకేయులు కంటే దారుణంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని, సంక్షేమ పథకాలను అడిగే వారిని అక్రమ కేసులతో జైలుకు పంపుతున్నారు. జిల్లాలో అధికార పార్టీని బదనాం చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై రుస్తుం మైన్లో అక్రమ మైనింగ్ చేయించారనే సాకు పెట్టి జైలుకు పంపారు. సోషల్ యాక్టివిస్టులతోపాటు కావలిలో జర్నలిస్టులను జైలుకు పంపారు.