Breadcrumb
Live Updates
IPL 2022: ఆర్సీబీని చిత్తుచేసిన ఎస్ఆర్హెచ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఆర్సీబీని చిత్తుచేసిన ఎస్ఆర్హెచ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ వరుసగా ఐదో విజయం సాధించింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ47 పరుగులతో దుమ్మురేపాడు. ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన 68 పరుగులకే ఆర్సీబీ కుప్పకూలింది. జానెసన్,నటరాజన్ దెబ్బకు ఆర్సీబీ బ్యాటర్లు విలవిలాడారు. జానెసన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు సాధించగా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేసాయి 15 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్
64 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన అభిషేక్ శర్మ..హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.
6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ 56/0
6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ 56/0. క్రీజులో విలియమ్సన్(8), అభిషేక్ శర్మ(46) ఉన్నారు
రెండు ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ 23/0
69 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్, అభిషేక్ శర్మ ఉన్నారు.
68 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ
సన్రైజర్స్ హైదరాబాద్తో జరగుతోన్న మ్యాచ్లో 68 పరుగులకే ఆర్సీబీ కుప్పకూలింది. జానెసన్,నటరాజన్ దెబ్బకు ఆర్సీబీ బ్యాటర్లు విలవిలాడారు. జానెసన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు సాధించగా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేసాయి 15 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 57/8
55 పరుగులకే ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్లో హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డయ్యాడు.13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 57/8
47 పరుగులకే 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ
సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. సుచిత్ బౌలింగ్లో దినేష్ కార్తీక్ స్టంపౌటయ్యాడు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
47 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రభుదేసాయి.. సుచిత్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు.
20 పరుగులకే నాలుగు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ
20 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మాక్స్వెల్.. నటరాజన్ బౌలింగ్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
8 పరుగలకే మూడు వికెట్లు.. కష్టాల్లో ఆర్సీబీ
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 8 పరుగలకే డుప్లెసిస్, విరాట్ కోహ్లి,అనుజ్ రావత్ వికెట్లు కోల్పోయింది. జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. కాగా ఈ సీజన్లో వరుసగా రెండో సారి గోల్డన్ డక్గా వెనుదిరిగాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్
ఐపీఎల్-2022లో శనివారం జరగున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరుజట్లు మార్పులేమి లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్వుడ్, మహ్మద్ సిరాజ్
Related News By Category
Related News By Tags
-
ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..!? ఆ ఐదుగురికి గుడ్బై?
ఐపీఎల్-2027 సీజన్ మినీ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బాటలోనే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కూడా...
-
కేసుల ఎఫెక్ట్.. జట్టు మారిన ఆర్సీబీ బౌలర్
ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ 2026-27 దేశవాళీ సీజన్కు ముందు ఉత్తరప్రదేశ్ జట్టును వీడి ఛత్తీస్గఢ్కు మారాడు. అతనిపై కొనసాగుతున్న చట్టపరమైన కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి...
-
ఇంగ్లండ్కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్ కోచ్
ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ నియామక ప్రక్రియకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పదవికి ప్రధాన పోటీదారుగా భావించిన ఆండీ ఫ్లవర్ తాను ఆ రేసులో లేనని స్పష్టం చేశారు. దీంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ...
-
బెంగళూరు తొక్కిసలాట కేసు: ఐపీఎస్ అధికారులకు క్లీన్ చిట్
బెంగళూరు: గత ఏడాది జూన్ నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాటి బె...
-
జట్టు ఎంపికలో శ్రేయస్ మార్క్.. ఆర్సీబీ ఏం పాపం చేసింది?
జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత క...


