Breadcrumb
Live Updates
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు.
అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగలకే కుప్ప కూలింది. 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యం కలుపుకుని శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక రెండు ఇన్నింగ్స్ల్లోను భారత బ్యాటర్ శ్రేయస్ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులు సాధించింది. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్గా తొలి టెస్టు విజయం.
47 ఓవర్లకు శ్రీలంక స్కోర్.. 175/5
47 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నే(84), ఆసలంక(4) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
160 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగలు చేసిన డిక్ వాలా.. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా పెవిలియన్కు చేరాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
105 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో విహారికి క్యాచ్ ఇచ్చి డిసిల్వా (4) ఔటయ్యాడు. క్రీజ్లో కురణరత్నే (40), డిక్వెల్లా ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక ..
శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మథ్యూస్.. జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
97 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన మెండిస్.. అశ్విన్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. 16 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 74/1
మూడో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక నిలికడగా ఆడుతుంది. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 74/1
మూడో రోజు ఆట ప్రారంభం
447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మూడో రోజు ఆటను మొదలు పెట్టింది. క్రీజులో కుశాల్ మెండిస్, కురుణరత్నే ఉన్నారు.
Related News By Category
Related News By Tags
-
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..!
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 15 సిరీస్లు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర పుటల్లో నిలిచింది. సోమవారం (మార్చి 14) శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్య...
-
శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్...
-
Ind Vs SL 2nd Test: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. తొలి రోజు టీమిండియాదే!
డే–నైట్ టెస్టు మ్యాచ్... గులాబీ బంతి అనూహ్యంగా టర్న్ అవుతూ, అంచనాలకు మించి బౌన్స్ అవుతూ ముల్లులా గుచ్చుకుంటోంది. ఫలితంగా 126 పరుగులకే భారత టాప్–5 పెవిలియన్కు... ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ అద...
-
ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
ఈ ఏడాది నవంబర్లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆసీస్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్...
-
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు: సునీల్ గవాస్కర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మరో అద్భుతమైన శతకంతో వ...