Breadcrumb
Live Updates
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు.
అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగలకే కుప్ప కూలింది. 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యం కలుపుకుని శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక రెండు ఇన్నింగ్స్ల్లోను భారత బ్యాటర్ శ్రేయస్ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులు సాధించింది. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్గా తొలి టెస్టు విజయం.
47 ఓవర్లకు శ్రీలంక స్కోర్.. 175/5
47 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నే(84), ఆసలంక(4) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
160 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగలు చేసిన డిక్ వాలా.. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా పెవిలియన్కు చేరాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
105 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో విహారికి క్యాచ్ ఇచ్చి డిసిల్వా (4) ఔటయ్యాడు. క్రీజ్లో కురణరత్నే (40), డిక్వెల్లా ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక ..
శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మథ్యూస్.. జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
97 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన మెండిస్.. అశ్విన్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. 16 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 74/1
మూడో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక నిలికడగా ఆడుతుంది. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 74/1
మూడో రోజు ఆట ప్రారంభం
447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మూడో రోజు ఆటను మొదలు పెట్టింది. క్రీజులో కుశాల్ మెండిస్, కురుణరత్నే ఉన్నారు.
Related News By Category
Related News By Tags
-
టీమిండియాకు ఊహించని షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో ...
-
న్యూ టీ20 మాస్ట్రో.. విరాట్ కోహ్లిని దాటేస్తాడా?
అభిషేక్ శర్మ.. టీ20 క్రికెట్లో భారత జట్టుకు దొరికిన అణిముత్యం. గతేడాది టీ20 దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అభిషేక్.. తన ఐపీఎల్ దూకుడును అంతర్జాతీ...
-
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్య...
-
BCCI: శుభ్మన్ గిల్కు మరో బిగ్ ప్రమోషన్..!
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు మరో బిగ్ ప్రమోషన్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దమైంది. 2025/26 సీజన్కు సంబంధించిన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గిల్‘ఏ ప్లస్’ కేటగిరీకి పద...
-
రోహిత్ తిట్టకపోతేనే బాధపడతా.. నా డ్రీమ్ అదే: జైశ్వాల్
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న జైశ్వాల్.. సిరీస్ డి...


