Breadcrumb
Live Updates
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు.
అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగలకే కుప్ప కూలింది. 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యం కలుపుకుని శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక రెండు ఇన్నింగ్స్ల్లోను భారత బ్యాటర్ శ్రేయస్ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులు సాధించింది. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్గా తొలి టెస్టు విజయం.
47 ఓవర్లకు శ్రీలంక స్కోర్.. 175/5
47 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నే(84), ఆసలంక(4) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
160 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగలు చేసిన డిక్ వాలా.. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా పెవిలియన్కు చేరాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
105 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో విహారికి క్యాచ్ ఇచ్చి డిసిల్వా (4) ఔటయ్యాడు. క్రీజ్లో కురణరత్నే (40), డిక్వెల్లా ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక ..
శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మథ్యూస్.. జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
97 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన మెండిస్.. అశ్విన్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. 16 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 74/1
మూడో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక నిలికడగా ఆడుతుంది. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 74/1
మూడో రోజు ఆట ప్రారంభం
447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మూడో రోజు ఆటను మొదలు పెట్టింది. క్రీజులో కుశాల్ మెండిస్, కురుణరత్నే ఉన్నారు.
Related News By Category
Related News By Tags
-
'అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి'
2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ...
-
ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 40 రోజుల్లో భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. తిరిగి టైటిల్న...
-
గంభీర్కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్...
-
టీమిండియాకు గుడ్ న్యూస్..
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్....
-
'అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు.. వరల్డ్కప్ టోర్నీకి రెడీ'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో చె...


