
సీజేఐపై దాడి దుర్మార్గం
సిద్దిపేటరూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మందకుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడిని రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే భావించాలన్నారు. ఈ ఘటన దళిత, పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఇన్చార్జి యాదగిరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.