మీడియా గొంతు నొక్కడమా? | - | Sakshi
Sakshi News home page

మీడియా గొంతు నొక్కడమా?

Sep 13 2025 7:23 AM | Updated on Sep 13 2025 7:39 AM

సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే..

చంద్రబాబు పెద్ద నియంత

దుబ్బాక: దేశంలోనే పెద్ద నియంత చంద్రబాబు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కక్షసాధించడం తగదు. సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను దళిత, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

– భీమసేన, భీమ్‌ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు

చంద్రబాబు వైఖరి దుర్మార్గం

దుబ్బాక: ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సాక్షిపై తప్పుడు కేసులు బనాయించడం దారుణం. ప్రజా ఉద్యమాలకు మొదటి నుంచి ఊపిరిపోస్తున్న సాక్షిపై చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న దుర్మార్గమైన వైఖరిని మాలమహానాడు తీవ్రంగా ఖండిస్తోంది.

– ర్యాకం శ్రీరాములు, జాతీయమాలమహానాడు రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్‌

పత్రికాస్వేచ్ఛను హరించడమే

దుబ్బాక: నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. చంద్రబాబు సర్కార్‌ భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం హేయమైన చర్య.

– అమ్మన రాంచంద్రారెడ్డి, సీనియర్‌ న్యాయవాది

మంచి పరిణామం కాదు..

సిద్దిపేటజోన్‌: పత్రికా స్వేచ్ఛను హరించవద్దు. పత్రికలపై నిర్బంధాలు మంచి పరిణామం కాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టుల మీద పెట్టిన అక్రమ కేసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలకు పాలకులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, అప్పుడే నిజానిజాలు బహిర్గతం అవుతాయి.

–పరమేశ్వర్‌. జిల్లా టీన్జీఓ అధ్యక్షుడు

నిర్బంధ చర్యలు తగవు

సిద్దిపేటజోన్‌: ప్రజలకు, ప్రభుత్వానికి వారధి పత్రికలు. పత్రికలు, జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించడం తగదు. నిర్బంధ చర్యలు మంచి సంస్కృతి కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణం. ఏపీ ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తే వాటిని ప్రభుత్వం సరిదిద్దుకోవాలి.

– విక్రమ్‌ రెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధి.

దాడులు సరికాదు

సిద్దిపేటజోన్‌: నిజాన్ని నిర్భయంగా వెలికితీయడమే మూల సూత్రంగా పనిచేసే మీడియాను ఇబ్బంది పెట్టడం, దాడులు చేయడం సరికాదు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే మీడియా స్వేచ్ఛకు భంగమే. ఇకనైనా జర్నలిస్టులపై దాడులు ఆపాలి.

– వరుకోలు రాజలింగం, అడ్వకేట్‌, సిద్దిపేట

మీడియా గొంతు నొక్కడమా?1
1/6

మీడియా గొంతు నొక్కడమా?

మీడియా గొంతు నొక్కడమా?2
2/6

మీడియా గొంతు నొక్కడమా?

మీడియా గొంతు నొక్కడమా?3
3/6

మీడియా గొంతు నొక్కడమా?

మీడియా గొంతు నొక్కడమా?4
4/6

మీడియా గొంతు నొక్కడమా?

మీడియా గొంతు నొక్కడమా?5
5/6

మీడియా గొంతు నొక్కడమా?

మీడియా గొంతు నొక్కడమా?6
6/6

మీడియా గొంతు నొక్కడమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement