
భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడాలి
కొమురవెల్లి(సిద్దిపేట): భూసార పరీక్షల ఆధారంగానే పంటలకు ఎరువులు వాడాలని భారతీయ పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్టు డాక్టర్ జయకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టంపేటలో వంద మంది రైతులకు ఉచితంగా సాయిల్ కిట్, బ్యాటరీ స్ప్రేయర్లు, తాడిపత్రిలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందించే సాయిల్ కిట్తో స్వయంగా పరీక్షలు చేసుకోవచ్చన్నారు. రైతులు ఇష్టానుసారంగా రసాయన ఎరువులను వాడి భూమిని విషతుల్యం చేయవద్దన్నారు. తక్కువ రసాయన ఎరువులు వాడుతూ సేంద్రియ వ్యవసాయం వైపు సాగాలన్నారు. కార్యక్రమంలో బారతీయ వరిపరిశోధన సీనియర్ సైంటిస్టులు డాక్టర్ బ్రిజేంద్ర, జశ్వంత్ కుమార్, బీజేపీ కేంద్ర రాష్ట్ర సమన్వయ కర్త బాల్రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.