
డీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వనజ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): డీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మంద వనజ నియమితులైనట్లు డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ మంగళవారం తెలిపారు. మంద వనజకు జిల్లా ఉపాధ్యక్షురాలుతో పాటుగా, జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాలకు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
కాంగ్రెస్తోనే
సామాజిక న్యాయం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని టీపీసీసీ నాయకుడు బొమ్మల యాదగిరి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ కలీమొద్దీన్తో కలిసి మాట్లాడారు. మంత్రి వర్గ కూర్పులో బహుజనులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వర్గంలో సామాజిక సమీకరణల ఆధారంగా పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల నాయకులకు మంత్రి వర్గంలో పెద్ద పీట వేశారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని కులాలకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు రాజు, పయ్యావుల ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ యాదవ విద్యార్థులకు
12న పురస్కారాలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉత్తమ ప్రతిభ కనబర్చిన యాదవ విద్యార్థులకు ఈ నెల 12న ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యాదవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ అధ్యక్షుడు బైరి రాములులతో కలిసి ఆయన మాట్లాడారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హరీశ్రావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర నాథ్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ తదితర ముఖ్య నాయకులు హాజరు కానున్నారన్నారు.
పురుషుల పొదుపు సంఘం
మహాసభ
హుస్నాబాద్రూరల్: పొట్లపల్లి పురుషుల పొదుపు సంఘం మహాసభ మంగళవారం నిర్వహించారు. సీడీఎఫ్ ధర్మకర్త అరుణ మాట్లాడుతూ 11 సంవత్సరాల కిందట ప్రారంభమైన పొదుపు సంఘం సభ్యులు ప్రతి నెలా రూ.100 చొప్పున పొదుపు చేస్తున్నారని చెప్పారు. సంఘంలో 395 మంది సభ్యులతో రూ.58 లక్షల వరకు చేరినట్లు చెప్పారు. గ్రామంలోని రైతులు, వ్యవసాయ కూలీలకు సంఘంలో ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.లక్ష వరకు అప్పు ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రంగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వనజ

డీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వనజ

డీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వనజ