
ఏరువాక సంబురం
పందిల్లలో నాగలిపట్టి పొలం దున్నుతున్న మంత్రి పొన్నం
జిల్లాలో ఏరువాక సాగు సంబరాలు ఘనంగా చేపట్టారు. మృగశిర కార్తెలో వచ్చే ఏరువాక పౌర్ణమికి కొత్త సాలు మొదలు పెడితే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం. పందిల్లలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి నాగలి పట్టారు. విత్తనాలు వేశారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. అలాగే అక్కన్నపేట మండలం బోరింగ్తండాలో రైతులతో కలిసి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) శ్రీలత పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టి సాగు పనులను ప్రారంభించారు.
– హుస్నాబాద్రూరల్/
అక్కన్నపేట(హుస్నాబాద్)

ఏరువాక సంబురం