
అన్నదానం చాలా గొప్పది
● ఎమ్మెల్యే హరీశ్రావు ● అమర్నాథ్కు సరుకుల లారీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అన్నదానానికి మించిన మరో దానం లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో యాత్రికులకు అన్నదానం కోసం సరుకుల లారీని గురువారం జిల్లా కేంద్రంలోని హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు శరబేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నం ప్రరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆకలితో ఉన్నవాడికి అన్న పెట్టినప్పుడు దొరికే తృప్తి మరెక్కడా దొరకదన్నారు. ఎముకలు కొరికే చలిలో వేడి వేడిగా పట్టెడు అన్నం దొరికితే అది అమృతంలా భావిస్తారన్నారు. కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి, అమర్నాథ్ అన్నదాన సేవ సమితి చేసిన కార్యక్రమాలు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు. సేవాతత్వంలో సిద్దిపేట పేరు దేశమంతా వినపడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్, అమర్నాథ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడల్లో పోటీ పడాలి..
సిద్దిపేటజోన్: ఈ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు పోటీ పడాలని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు పూర్తి చేసుకున్న వారితో ముచ్చటించారు. హరీశ్రావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే క్రీడలు, యోగా, చదువు అనేవి ముఖ్యమన్నారు. సిద్దిపేటలో క్రీడలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించి క్రీడా హబ్ గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం కార్యాలయాన్ని ప్రారంభించారు.మంత్రివర్గంలో యాదవులకు చోటేది
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గంలో యాదవులకు చోటు లేకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారరాలు, అభినందన కార్యక్రమంలో హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కుల సంఘాలు కృషి చేయాలన్నారు. కుల సంఘాలు విద్యా ర్థులను ప్రోత్సహించాలన్నారు. యాదవ విద్యార్థులు యాదవ జాతి గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయాలన్నారు. యాదవులకు హైదరాబాద్లో ని కోకాపేటలో కేసీఆర్ ఆత్మ గౌరవ భవనాలు నిర్మించారన్నారు. రేవంత్ రెడ్డి యాదవులకు గోర్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని వెటర్నరీ ఆస్పత్రులలో పాడి పశువులకు మందులు లేవన్నారు. పాఠశాలలు ప్రారంభమైనా విద్యాశాఖకు ఇంకా మంత్రి లేరని విమర్శించారు.