
పాఠశాలలకు పూర్వవైభవం తెస్తాం
సిద్దిపేటఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకే అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు వచ్చేందుకే కస్తూర్బా, మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్ అన్ని ముందస్తుగానే అందిస్తున్నామన్నారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను కూడా పెంచి విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో విశ్వాసంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారని మంత్రి తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదవాలని అన్నారు. కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అన్ని రకాల వసతులను అందజేసేలా కృషి చేస్తున్నామని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పిస్తున్నాం
విద్యార్థులు కష్టపడి చదివిఉన్నత స్థాయికి చేరాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
ఐక్యంగా బలోపేతం చేద్దాం
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేటలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ(కేజీబీవీ) భవనం, రేగొండలో మూడపడిన ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలుగేళ్లుగా మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను అందజేశారు.
రేగొండను విలీనం చేస్తాం
అక్కన్నపేట మండలంలో ఉన్న రేగొండ గ్రామాన్ని హుస్నాబాద్లో విలీనం చేస్తానని మంత్రి తెలిపారు. రేగొండ నుంచి అక్కన్నపేటకు వెళ్లాలంటే దూరంగా ఉంటుందని, హుస్నాబాద్కు మాత్రం చాలా దగ్గరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో అవగాహన లేక పోవడంతో ఇష్టానుసారంగా కలపారన్నారు.