
కంప్యూటర్ విద్యలోనూ రాణించాలి
హుస్నాబాద్: ప్రతి విద్యార్థి కంప్యూటర్ విద్యలోనూ ప్రావీణ్యత సాధించాలని మంత్రి పొన్నం అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్లో మెలకువలు నేర్చుకోవాలన్నారు. పాఠశాలలో ఎలాంటి నియామకాలు అవసరమో సిద్ధం చేసి, పాఠశాలకు పెయింటింగ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం అందించాలన్నారు.