బడులను బతికించారు | - | Sakshi
Sakshi News home page

బడులను బతికించారు

Jun 12 2025 11:04 AM | Updated on Jun 12 2025 11:04 AM

బడులన

బడులను బతికించారు

సరికొత్తగా ఆహ్వానించేలా..
తల్లులకు బొట్టుపెట్టి..

అక్కన్నపేట(హుస్నాబాద్‌): ఎట్టకేలకు మూతబడిన పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయి. గత ఏడాది విద్యార్థులు లేక బడులకు తాళం వేశారు. ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ చూపి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో విద్యార్థులు చేరారు. మండలంలో మొత్తం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 65, ఉన్నత పాఠశాలలు 9, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), గిరిజన బాలికల గురుకులం ఉన్నాయి. ఇందులో గత ఏడాది 13 ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు లేక మూసివేశారు. ఈ నేపథ్యంలో మండల విద్యాధికారి రంగానాయక్‌, ఉపాధ్యాయులందరూ ఇంటింటా బడిబాట కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో రేగొండలోని ప్రాథమిక పాఠశాలలో ఏకంగా 35మంది విద్యార్థులు చేరారు. అలాగే కెప్టన్‌ చౌడుతండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ప్రవేశాలను పొందారు. ఈ క్రమంలో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా రేగొండ, కెప్టన్‌ చౌడుతండా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం చేయనున్నారు. అలా గే ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న కేజీబీవీ భవనాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు.

కొండపాక(గజ్వేల్‌): సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సరికొత్త పద్ధతులతో ఆహ్వానం పలకనున్నారు. ఈ మేరకు హెచ్‌ఎం జయప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు రూ.4 లక్షలతో పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు స్పోర్ట్స్‌ జతలు, అలాగే స్వచ్ఛమైన మంచి నీరు అందేలా మినీ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. సిద్దిపేట, కొండపాక, దుద్దెడలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే సుమారు 70 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చేరేలా హెచ్‌ఎం కృషి చేశారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 210కి చేరింది. ప్రారంభం రోజున పాఠశాల నూతన శోభ సంతరించుకోనుంది.

హుస్నాబాద్‌రూరల్‌: అంగన్‌వాడీలకు చిన్నారులను పంపించాలని కోరుతూ బుధవారం పందిల్ల, పొట్లపల్లి గ్రామాల్లో టీచర్లు ఇంటింటికీ తిరిగి పిల్లల తల్లులకు బొట్టుపెట్టి పలకరించారు. ఈ సందర్భంగా సీడీపీఓ జయ మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు ఆటపాటలు, పౌష్టికాహారం ఇస్తున్నట్లు తెలిపారు. ఆలాగే వారంలో రెండు రోజులు ఎగ్‌ బిర్యానీ కూడా పెడుతున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీల బలోపేతమే లక్ష్యమన్నారు.

రేగొండ, కేప్టన్‌ చౌడుతండాలో

తెరుచుకోనున్న పాఠశాలలు

నేడు మంత్రిచే పునఃప్రారంభం

బడులను బతికించారు1
1/3

బడులను బతికించారు

బడులను బతికించారు2
2/3

బడులను బతికించారు

బడులను బతికించారు3
3/3

బడులను బతికించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement