ఫలించిన పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఫలించిన పోరాటం

Jun 11 2025 11:51 AM | Updated on Jun 11 2025 11:51 AM

ఫలించ

ఫలించిన పోరాటం

ఎస్టీ జాబితాలోకి నక్కల కులస్తులు

ఆనందంగా ఉంది

మా కులానికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు లేక చాలా నష్టోయాం. రిజర్వేషన్లు లేకపోవడంతో మా పిల్లలు ఉన్నత విద్య, ఉద్యోగాలకు దూరమయ్యారు. ఇన్నాళ్లకు తమ కులాన్ని గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చడం ఆనందంగా ఉంది. మాకు అండగా నిలిచిన సామాజిక సమరసత వేదికకు రుణపడి ఉంటాం.

– తుమ్మల రాజు,చిన్న ముత్యంపేట

అన్ని రంగాల్లో రిజర్వేషన్లు

క్కల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న జనాభాకు న్యాయం జరిగింది. ఇకనుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులమయ్యాం. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటాం.

– కాలియ యాదగిరి,

సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

తరతరాలుగా సంచార జీవనం సాగిస్తున్న నక్కల (పిట్టల) కులస్తుల ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ప్రభుత్వం నక్కల కులస్తులను తాజాగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చింది. ఇక నుంచి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందనున్నాయి. అడవులు, గ్రామశివారుల్లో దుర్భర పరిస్థితుల్లో బతుకులు వెళ్లదీస్తున్న వీరిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటూ సామాజిక సమరసత వేదిక నేతృత్వంలో ఎనిమిదేళ్లుగా ఉద్యమించారు. వీరి న్యాయమైన సమస్యను గుర్తించి ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నక్కల కులస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

– దుబ్బాక

95 శాతం నిరక్షరాస్యత

నక్కల(పిట్టల) కులస్తులు అడువులు, చెలకల్లో ఉంటూ పిట్టలు పట్టుకోవడం, మామిడి, చింత, వెలగ చెట్లను గుత్తకు పట్టుకొని వాటి కాయలను అమ్ముకుంటూ తరాలుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కులసర్టిఫికెట్‌ లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటూవస్తున్నారు. 95 శాతానికి పైగా ఈ కులస్తులు నిరక్షరాస్యులే కావడం శోచనీయం.

రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు..

నక్కల కులస్తులను ఎస్టీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు, జిల్లాలో 600 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తొగుట మండలం చిన్నముత్యంపేట, దుబ్బాక తో పాటు మండలంలోని చిట్టాపూర్‌, నర్సాయపల్లి, దమ్మక్కపల్లి, రాఘవాపూర్‌, మందపల్లి, ధర్మారం, బస్వాపూర్‌, సలాక్‌పూర్‌ తదితర 12 గ్రామాల్లో 600 వరకు నక్కల జాతి కులస్తులు ఉన్నరు. ఇందులో చిన్నముత్యంపేటలో 80 కిపైగా నక్కల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.

సామాజిక సమరసత వేదిక అండతో..

నక్కల కులస్తుల దర్భుర పరిస్థితులను చూసి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌జీ చలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిపై అధ్యయనం చేశారు. నక్కల కులస్తుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే సంకల్పంతో ఏమిదేళ్లుగా పోరాటం చేశారు. పిట్టల వారు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులను, కలెక్టర్లను కలిసి ఎన్నో వినతిపత్రాలు అందజేశారు. వీరి పరిస్థితిని కేంద్ర మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లారు.అంతేకాకుండా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మను కలిసి వీరి దుర్భరపరిస్థితిని వివరించి, వినతి పత్రం అందించారు. ఎట్టకేలకు వీరి పోరాటం సఫలీకృతం కావడంతో నక్కల కులస్తుల్లో సంతోషం నెలకొంది.

సుదీర్ఘ పోరాటంతోనే..

క్కల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. ఎస్టీలుగా గుర్తించడంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘపోరాటం చేసి ఫలితాన్ని అందుకున్నాం. పోరాటంలో సహకరించిన గవర్నర్‌, కలెక్టర్‌ మను చౌదరికి ధన్యవాదాలు.

– అప్పల ప్రసాద్‌ జీ, కన్వీనర్‌ రాష్ట్ర సామాజిక సమరసత వేదిక

ప్రభుత్వ నిర్ణయంతో

జిల్లాలో 600 కుటుంబాలకు లబ్ధి

ఇప్పటి వరకు కుల సర్టిఫికెట్లు లేక

సంక్షేమ పథకాలకు దూరం

చిన్నముత్యంపేటలో కులస్తులకు

సర్టిఫికెట్లు జారీ

కుల ధ్రువీకరణ పత్రాలు జారీ

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొగుట మండలం చిన్నముత్యంపేటను రెవెన్యూ అధికారులు సందర్శించి పూర్వ పరాలను విచారించారు. తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తన కార్యాలయంలో నక్కల కులస్తులకు పదిరోజుల క్రితం ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దీంతో అన్ని రకాల ప్రభుత్వ పథకాలను పొందుతారు.

ఫలించిన పోరాటం1
1/4

ఫలించిన పోరాటం

ఫలించిన పోరాటం2
2/4

ఫలించిన పోరాటం

ఫలించిన పోరాటం3
3/4

ఫలించిన పోరాటం

ఫలించిన పోరాటం4
4/4

ఫలించిన పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement